www.ntodaynews.com
మేదరివాడలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
తెలంగాణ
/
మంచిర్యాల
మేదరివాడలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ: పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
మంచిర్యాల పట్టణంలోని మేదరివాడలో శ్రీ వీరాంజనేయ స్వామి సహిత శివపంచాయతన దేవాలయ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, మేదరివాడ భక్తుల చిరకాల వాంఛ అయిన ఈ ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు