www.ntodaynews.com
కారుణ్య నియామకాల పత్రాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
కృష్ణా
మచిలీపట్నం: కారుణ్య నియామకాల పత్రాల పంపిణీ
మచిలీపట్నంలో సోమవారం నిర్వహించిన “మీకోసం” సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ 10 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా 7 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా, 1 మందిని స్లీపర్గా, 1 మందిని ఆఫీస్ సబార్డినేట్గా, మరొకరిని సచివాలయం ఉద్యోగిగా నియమిస్తూ పత్రాలు అందించారు.
ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా మొత్తం 150 మందికి కారుణ్య నియామక పత్రాలు అందినట్లు అధికారులు తెలిపారు.