మదనపల్లె చిన్నారి కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం....
మదనపల్లె చిన్నారి కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం....
..జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
మదనపల్లిలో చిన్నారి హత్య నేపథ్యంలో.. నేడు చిన్నారి తల్లిదండ్రులకు పరామర్శించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పి, బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకు రూ. 10 లక్షల చెక్ ను అందించిన మంత్రి.
మదనపల్లి మండలం నీరుగట్టువారిపల్లిలో ఫిబ్రవరి 17వ తేదీన చోటుచేసుకున్న చిన్నారి హత్య సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. అమాయక బాలిక ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం చిన్నారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి మరియు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.