మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని ప్రగడవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే (మెగా పీటీఎం–4.0) కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే ముఖాముఖిగా సమావేశమై విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, క్రమశిక్షణ, అభ్యాస నైపుణ్యాలపై చర్చించారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి తీసుకొస్తున్న సంస్కరణలు విజయవంతం కావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, అభ్యాస కార్యక్రమాలను ఎమ్మెల్యే పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.