BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 19 March 2026, 10:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహారాష్ట్రలో సంచలనం… గాడ్‌మ్యాన్ అరెస్ట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:03 PM
160 వీక్షణలు

మహారాష్ట్రలో సంచలనం… గాడ్‌మ్యాన్ అరెస్ట్

మహారాష్ట్రలో ఓ స్వయంఘోషిత గాడ్‌మ్యాన్ అరెస్ట్ కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జ్యోతిష్యుడు, న్యూమరాలజిస్ట్‌గా పేరుగాంచిన అశోక్ కారత్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాసిక్‌కు చెందిన ఈ వ్యక్తికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నవంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు 35 ఏళ్ల మహిళపై పలు మార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి దాడులకు పాల్పడి, వాటిని వీడియోగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో భాగంగా 58 అసభ్య వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ కారత్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 కింద అత్యాచారం కేసుతో పాటు ఇతర తీవ్ర నేరాల కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడి సంబంధాలు, ఇతర బాధితుల అంశంపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.