BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

మహారాష్ట్రలో సంచలనం… గాడ్‌మ్యాన్ అరెస్ట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:03 PM
65 వీక్షణలు

మహారాష్ట్రలో సంచలనం… గాడ్‌మ్యాన్ అరెస్ట్

మహారాష్ట్రలో ఓ స్వయంఘోషిత గాడ్‌మ్యాన్ అరెస్ట్ కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జ్యోతిష్యుడు, న్యూమరాలజిస్ట్‌గా పేరుగాంచిన అశోక్ కారత్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాసిక్‌కు చెందిన ఈ వ్యక్తికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నవంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు 35 ఏళ్ల మహిళపై పలు మార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి దాడులకు పాల్పడి, వాటిని వీడియోగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో భాగంగా 58 అసభ్య వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ కారత్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 కింద అత్యాచారం కేసుతో పాటు ఇతర తీవ్ర నేరాల కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడి సంబంధాలు, ఇతర బాధితుల అంశంపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.