మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్
మంచిర్యాల: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యతిరేకించడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లును అడ్డుకోవడం వల్ల రాష్ట్రంలో మహిళా లోకానికి తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ఈ బిల్లు అమలు కాకపోవడం వల్ల తెలంగాణలో సుమారు 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా, 9 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యే అవకాశాన్ని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. మహిళల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ స్పీడ్ బ్రేకర్ లా మారిందని, మహిళా రిజర్వేషన్ల పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా రఘునాథ్ స్పష్టం చేశారు