BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ సంచలనం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:32 AM
26 వీక్షణలు

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. పూల్‌-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 6-1 గోల్స్ తేడాతో చిత్తు చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

మ్యాచ్ 11వ నిమిషంలో సునేలిటా టొప్పో తొలి గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యం అందించింది. రెండో క్వార్టర్‌లో నవ్‌నీత్ కౌర్, సుశీలా చాను చెరో గోల్‌ సాధించి ఆధిక్యాన్ని మరింత పెంచారు. మూడో భాగంలో దీపికా, లాల్రెమ్సియామి, రాణా సాక్షి తలో గోల్‌ చేసి భారత విజయాన్ని ఖాయం చేశారు.

ఆట మొత్తం సమన్వయంతో, దూకుడుతో సాగించిన భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్‌లో తమ సత్తా చాటింది. ఈ విజయంతో జట్టులో ఉత్సాహం మరింత పెరిగింది.