మహిళలు అన్ని రంగాలలో రాణించాలి: కలెక్టర్ కుమార్ దీపక్
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి: కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ పథకాలు మరియు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాలలో రాణించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెర్ప్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలు పెట్రోల్ బంకులు, డెయిరీలు, సోలార్ పవర్ ప్లాంట్లు వంటి ఉపాధి రంగాల్లోకి రావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల శిక్షణ కార్యక్రమం ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, ఇందిరా మహిళా శక్తి పథకం మరియు PMFME ద్వారా లభించే ఆర్థిక సహాయంతో తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని మహిళా శక్తి భవన్ను వినియోగించుకోవాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో మహిళా సంఘాలు క్రియాశీలక భాగస్వాములు కావాలని కలెక్టర్ వివరించారు.