మల్లంపేట్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మల్లంపేట్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మల్లంపేట లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్, హడాక్ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్ స్వామివారి పూజల లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 500 ఏళ్ల చరిత్ర గల ఆలయం లో హనుమంతుని దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నారు. రానున్న రోజుల్లో దేవాలయ అభివృద్ధిని హడాక్ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో చేపడుతామన్నారు. కోట్లాది రూపాల దేవాలయ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకున్నామన్నారు. అనంతరం ఆయన జెండాను ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ నామస్మరణతో జండాలు పట్టుకుని విధుల గుండా పాదయాత్ర నిర్వహించారు