www.ntodaynews.com
15వ రోజుకు చేరిన దివాకరన్న పెరుగన్నం పంపిణీ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ నాయకులు సాగి వెంకటేశ్వరరావు, మొగిలి శ్రీనివాస్, సాగి శ్రీధర్ రావు, హనుమండ్ల రాజేశం, మొగిలి సత్యం, అప్పాసు వెంకటేశ్వర్లు, మరియు గుడిసెల తిరుపతి గార్లు పాల్గొని ప్రజలకు పెరుగన్నం పంపిణీ చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ హండే, జూపాక సుధీర్, మంతెన గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. వేసవి ఎండల దృష్ట్యా పేదలకు, బాటసారులకు ఈ పంపిణీ ఎంతో ఆసరాగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు