www.ntodaynews.com
మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద మిన్నంటిన నిరసన: కార్మికుల భారీ సమ్మె
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల ఆర్టీసీ బస్ డిపో వద్ద కార్మికులు చేపట్టిన భారీ సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. తమ 32 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆందోళన చేపట్టిన కార్మికులకు ఐఎఫ్టియు మరియు న్యూ డెమోక్రసీ సంఘాలు మద్దతు తెలపగా, బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే నాలుగు వారాల గడువులోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు