www.ntodaynews.com
మంచిర్యాల అడిషనల్ కలెక్టర్గా వడల రాములు బాధ్యతల స్వీకారం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్గా (రెవెన్యూ) వడల రాములు బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ (JAC) నాయకులు ఆయనను మర్యాదపూర్వకలంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజ నాయకత్వంలో నాయకులు అడిషనల్ కలెక్టర్ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పొన్న మల్లయ్య, శ్రీపతి బాబురావు, శ్రావణ్ కుమార్, శ్రీనివాసరావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వడల రాములు గారు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి మరియు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.