ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదరం (SADAREM)
మంచిర్యాల: ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదరం (SADAREM) ప్రత్యేక వైద్య శిబిరాలు
మంచిర్యాల జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగుల కోసం ఏప్రిల్ 2026 నెలలో ప్రత్యేక UDID/SADAREM వైద్య శిబిరాలను మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించనున్నారు. ఈ శిబిరాలు ఏప్రిల్ 1న వినికిడి లోపం, ఏప్రిల్ 2, 10, 13, 17 తేదీల్లో లోకోమోటార్ (ఆర్థో), ఏప్రిల్ 7న కొడవలి కణం (సికిల్ సెల్), ఏప్రిల్ 23న దృష్టి లోపం మరియు ఏప్రిల్ 30న మానసిక వైకల్యం ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. గత మార్చి 26, 2026 వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, అర్హులైన వారికి వారి ఫోన్ నంబర్ల ద్వారా ముందస్తు సమాచారం అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సంబంధిత ధృవీకరణ పత్రాలతో నిర్ణీత తేదీల్లో ఉదయం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది