www.ntodaynews.com
మంచిర్యాల గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: ‘గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ టీఎస్టీయూసీ (TSTUC) నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్టీయూసీ నాయకుడు మణిరామ్ సింగ్ మాట్లాడుతూ, గ్రాట్యుటీపై ఉన్న సీలింగ్ను ఎత్తివేసి రూ.20 లక్షలకు పెంచిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక శాఖ ప్రాంతీయ అధికారి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు