BREAKING
రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
www.ntodaynews.com

మంచిర్యాల - హైదరాబాద్‌కు జాతీయ రహదారి నిర్మించాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రఘునాథ్ వెరబెల్లి వినతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 01:50 PM
18 వీక్షణలు

​రాజీవ్ రహదారి సమస్యల పరిష్కారానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి

​హైదరాబాద్: మంచిర్యాల - హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారి వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను పరిష్కరించడానికి నూతనంగా జాతీయ రహదారిని నిర్మించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి శనివారం హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన నాగ్‌పూర్ - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేను చంద్రపూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట మీదుగా హైదరాబాద్ వరకు నిర్మించేలా ఉన్న అవకాశాలను పరిశీలించాలని, దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడాలని కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాల మీదుగా నూతన జాతీయ రహదారిని నిర్మిస్తే రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, వాహనదారుల ప్రయాణం సురక్షితంగా మరియు సులభతరంగా మారుతుందని రఘునాథ్ వెరబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు