BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 09:03 PM
111 వీక్షణలు

​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 ​రైతుల ఆందోళనలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలి
​ పెద్దపల్లి మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వండి
​ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లాలని సూచన
​ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్
​మంచిర్యాల, మే 19 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో వేగంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి, రోడ్లపై ఎదురుచూస్తున్న రైతుల ఆందోళనలకు తావివ్వకుండా వారి కష్టాలను తీర్చాలని ఆయన ప్రజా ప్రభుత్వానికి సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని రైస్ మిల్లర్లకు ధాన్యం సేకరణపై తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
​ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి ఈ ధాన్యం సేకరణ సమస్యను తీసుకెళ్లాలని అధికారులను కోరారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నదాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎంపీ వంశీకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.