మంచిర్యాల జిల్లాలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన
మంచిర్యాల జిల్లాలో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన
మంచిర్యాల: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) (ఆదివారం, ఏప్రిల్ 12న) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ను పార్టీ శ్రేణులు విడుదల చేశాయి.
పర్యటన వివరాలు ఇవే:
ఉదయం 11:30 గంటలకు: గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల సందర్శన.
మధ్యాహ్నం 12:00 గంటలకు: మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో టీ విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు: జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కీలక సమావేశం. ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గానికి సన్మానం చేయనున్నారు.
మధ్యాహ్నం 01:30 గంటలకు: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహ వేడుకకు హాజరై, ఎంఎన్ఆర్ (MNR) గార్డెన్స్లో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
మధ్యాహ్నం 02:30 గంటలకు: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్క సుమన్ నివాసంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేటీఆర్ రాక దృష్ట్యా జిల్లా పార్టీ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది