www.ntodaynews.com
మంచిర్యాల జిల్లాలో రెండు రోజులు తాగునీటి సరఫరా నిలిపివేత
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో రెండు రోజులు తాగునీటి సరఫరా నిలిపివేత
మంచిర్యాల జిల్లా రంగంపేట వద్ద 1000 మి.మీ. వ్యాసం కలిగిన ప్రధాన పైప్లైన్కు ఏర్పడిన లీకేజీ మరమ్మత్తుల కారణంగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల చెన్నూర్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్, మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూర్, మరియు కోటపల్లి మండలాలకు నీటి సరఫరా ఉండదని, కావున ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు