మే డే వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: మే డే వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మే డే వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై 140 వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం తాము ఎల్లప్పుడూ ముందుంటామని, మే డే స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. రేపు ఉదయం 8 గంటలలోపు కార్మికులందరూ వేడుకల స్థలానికి చేరుకుని, ఎమ్మెల్యే గారి సమక్షంలో జరగబోయే మే డే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధరణి మధు, కార్పొరేటర్ సదానందం, సంఘం గౌరవాధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ, నస్పూర్ మరియు విలీన గ్రామాల అధ్యక్షులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు