www.ntodaynews.com
41వ డివిజన్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
మంచిర్యాల: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆకుల అశోక్ వర్ధన్ పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో బీజేపీ పోషిస్తున్న పాత్రను, పార్టీ సిద్ధాంతాలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాములు, రవీందర్ రావు, సత్యనారాయణ, ప్రణవ్, శ్రీనివాస్, సంజీవ్, అశ్విన్, సాయి, నాగరాజు, చిరంజీవి, కమలాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు