www.ntodaynews.com
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మందమర్రి
మంచిర్యాల: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు కింద పడి సుమారు 30 నుండి 35 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మిలిటరీ రంగు షర్టు, సిమెంట్ రంగు లోయర్ ధరించి ఉండగా, అతని వద్ద హైదరాబాద్ నుండి కొండపల్లికి వెళ్లే రైలు టికెట్ లభ్యమైంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని గుర్తించిన వారు లేదా అతని వివరాలు తెలిసిన వారు 8712658596 లేదా 9849058691 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు