www.ntodaynews.com
మంచిర్యాల: రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని శవం లభ్యం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మృతుడి వివరాల కోసం పోలీసుల అన్వేషణ.. నశం రంగు ప్యాంటు, తెల్ల బనియన్తో గుర్తింపు
మంచిర్యాల - పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ల మధ్య గల అండర్ బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు.
ఈ ప్రమాద తీవ్రతకు మృతుడి తల పగిలి, శరీర భాగాలు ఛిన్నభిన్నమయ్యాయి. మృతుడు నశం రంగు (గోధుమ/ఆష్ కలర్) ప్యాంటు, తెల్లని బనియన్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసుకుని, మృతుడి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నారు