ఈ నెల 27న ఘనంగా గో ఆరాధన దినోత్సవం
ఈ నెల 27న ఘనంగా 'గో ఆరాధన దినోత్సవం' - గో సంరక్షణ సమితి పిలుపు
గోవుల సంరక్షణ కోసం ప్రతి హిందువు నడుం బిగించాలని గో సంరక్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న 'గో ఆరాధన దినోత్సవం' కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను శనివారం మంచిర్యాలలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. గోవును పూజించడం మన సంస్కృతిలో భాగమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గోనె శ్యాంసుందర్ రావు, సూర్యకాంత్, హరిప్రసాద్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ గో ఆరాధన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు