BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

​మంచిర్యాలలో 20న మినీ జాబ్ మేళా

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 03:44 PM
89 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జూన్ 20వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు.

ఈ జాబ్ మేళా ఉదయం 10:30 గంటలకు స్థానిక హైటెక్ సిటీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని మోడల్ కెరీర్ సెంటర్ (MCC)లో నిర్వహించబడుతుంది. ఈ మేళాలో ITM Skills Academy సంస్థ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 100 సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ (SRM) పోస్టుల భర్తీకి అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే B.Tech, B.E, MBA చదివిన అభ్యర్థులు అర్హులు కాదని అధికారులు స్పష్టం చేశారు.

ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3.2 లక్షల నుంచి రూ.3.8 లక్షల వరకు వేతనం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సూచించారు.

మరిన్ని వివరాల కోసం 8096857078, 9705820030, 8333059029 నంబర్లను సంప్రదించవచ్చు.