www.ntodaynews.com
మంచిర్యాలలో భారీ దొంగతనం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాలలో భారీ దొంగతనం: రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇంట్లో 40 తులాల బంగారం అపహరణ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమేశ్వర కాలనీలో భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి నాగన్న కుటుంబ సభ్యులు బుధవారం బంధువుల ఇంటికి వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలోని 40 తులాల బంగారం, 2 కిలోల వెండి మరియు రూ. 1.50 లక్షల నగదు దోచుకెళ్లారు. గురువారం రాత్రి బాధితులు తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు