BREAKING
వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతీకూల పరిస్థితులో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు జరపడం అభినందనీయం--మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్‌బీఐ సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకింగ్ సేవలు వివాహేతర సంబంధం.. భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య! చదువు రాదన్న సాకు చెల్లదు.. సంతకం పెడితే అప్పు తీర్చాల్సిందే!” మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బూరుగూడెం రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి ఎండల వేళ పిజిఆర్ఎస్‌కు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతీకూల పరిస్థితులో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు జరపడం అభినందనీయం--మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్‌బీఐ సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకింగ్ సేవలు వివాహేతర సంబంధం.. భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య! చదువు రాదన్న సాకు చెల్లదు.. సంతకం పెడితే అప్పు తీర్చాల్సిందే!” మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బూరుగూడెం రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి ఎండల వేళ పిజిఆర్ఎస్‌కు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
www.ntodaynews.com

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 May, 2026 - 06:45 AM
22 వీక్షణలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోలుపై రూ.2.84, డీజిల్పై రూ.2.86 చొప్పున ధరలు పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజు ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58కు, డీజిల్ ధర రూ.103.74కు చేరింది. విజయవాడలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.104.88గా నమోదైంది.

ఇటీవల వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటం ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ముఖ్యంగా కేవలం 10 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.