www.ntodaynews.com
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జాతీయం
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోలుపై రూ.2.84, డీజిల్పై రూ.2.86 చొప్పున ధరలు పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజు ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58కు, డీజిల్ ధర రూ.103.74కు చేరింది. విజయవాడలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.104.88గా నమోదైంది.
ఇటీవల వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటం ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ముఖ్యంగా కేవలం 10 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.