BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మటన్‌ను మించిన చింతచిగురు ధర.. కేజీ రూ.1000కు చేరిన ఆకుకూర!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 07:16 AM
148 వీక్షణలు

వర్షాకాలంలో విరివిగా లభించే చింతచిగురు ధరలు ఈ ఏడాది ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా రూ.400-500 మధ్య ఉండే కేజీ చింతచిగురు ధర కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.1000కు చేరడంతో వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో కేజీ రూ.1000 పలకగా, హైదరాబాద్ మార్కెట్లలో రూ.800 వరకు విక్రయిస్తున్నారు.

ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో చింత చెట్లకు కొత్త చిగురు తక్కువగా రావడం, మార్కెట్లలో సరఫరా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. మరోవైపు చింతచిగురుకు డిమాండ్ మాత్రం తగ్గకపోవడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

చింతచిగురు పప్పు, చింతచిగురు మటన్ కర్రీ, పచ్చడి వంటి వంటకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ప్రత్యేక రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా అధిక ధరలున్నా కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే చింతచిగురు రోగనిరోధక శక్తి పెంపు, జీర్ణక్రియ మెరుగుదల, రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం ధరలు సామాన్యుల జేబుకు భారంగా మారాయి.

వర్షాభావంతో పాటు చిగురు సేకరణ, కూలీ, రవాణా ఖర్చులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.