BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 31 May 2026, 07:10 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మత్తు రహిత సమాజమే లక్ష్యం: పీలేరు. పుంగనూరు పరిధిలో 'డ్రగ్ డిటెక్షన్' కిట్లతో ముమ్మర తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 May, 2026 - 07:10 PM
104 వీక్షణలు

అన్నమయ్య జిల్లా  పుంగనూరు 

మదనపల్లి :  జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించేందుకు అధునాతన సాంకేతికతతో కూడిన డ్రగ్ డిటెక్షన్ కిట్లను వినియోగిస్తూ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు చేపట్టారు.

పీలేరు, పుంగనూరు పరిధిలో గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన నిందితులు, అనుమానితులపై నిఘా ఉంచి శనివారం ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. పీలేరులో 8 మందికి, పుంగనూరులో 5 గురు అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు నెగిటివ్ అని తేలింది.

ప్రజలు తమ పరిసరాలలో మాదకద్రవ్యాల వినియోగం లేదా ఆక్రమ రవాణా గమనిస్తే వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.