మత్తు రహిత సమాజమే లక్ష్యం: పీలేరు. పుంగనూరు పరిధిలో 'డ్రగ్ డిటెక్షన్' కిట్లతో ముమ్మర తనిఖీలు
అన్నమయ్య జిల్లా పుంగనూరు
మదనపల్లి : జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించేందుకు అధునాతన సాంకేతికతతో కూడిన డ్రగ్ డిటెక్షన్ కిట్లను వినియోగిస్తూ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు చేపట్టారు.
పీలేరు, పుంగనూరు పరిధిలో గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన నిందితులు, అనుమానితులపై నిఘా ఉంచి శనివారం ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. పీలేరులో 8 మందికి, పుంగనూరులో 5 గురు అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు నెగిటివ్ అని తేలింది.
ప్రజలు తమ పరిసరాలలో మాదకద్రవ్యాల వినియోగం లేదా ఆక్రమ రవాణా గమనిస్తే వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.