మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు
ఈ నెల 28న హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయ ధర్నాను జయప్రదం చేయండి
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే కార్మికులకు పండుగ సెలవులు ఇవ్వాలని, 60 ఏళ్లు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మరియు ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న హైదరాబాద్లోని సీడీఎంఏ (CDMA) కార్యాలయం వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాసర్ల రాజలింగుతో పాటు కార్మికులు దేవవరం, ఎల్లయ్య, రాజు, రవి, నారాయణ, రమేష్, తిరుపతి, పోశం, విష్ణు తదితరులు పాల్గొన్నారు