BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

మురుగులో మగ్గుతున్న చింతలపాడు.. అధికారుల నిర్లక్ష్యానికి గ్రామస్తుల ఆవేదన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 07:00 PM
59 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడు గ్రామం రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ అధికారుల అలసత్వానికి బలైపోతోంది. చుట్టుపక్కల పది గ్రామాలకు కూడలిగా ఉన్న చింతలపాడు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రధాన గ్రామం. అయితే గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైకి చేరి నడిబొడ్డునే నిల్వ ఉండిపోతోంది. దీంతో గ్రామమంతా దుర్గంధభరితంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత విచిత్రం ఏమిటంటే గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ప్రతిరోజూ ఇదే మురుగు నీటిని దాటి విధులకు హాజరవుతున్నప్పటికీ సమస్యపై స్పందించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

దైవ దర్శనాలకు వెళ్లేందుకు బస్సుల కోసం వచ్చే భక్తులు, శుభకార్యాలకు వెళ్లే మహిళలు, వృద్ధులు ఈ మురుగు నీటిలోనే నడవాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన మురుగు నీటితో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“ఇది చింతలపాడా.. లేక మురుగుగుంటలపాడా?” అంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మురుగు సమస్య నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.