బాల్య వివాహ నివారణ చర్యలు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
బాల్య వివాహ ముక్తభారత్ ప్రతిజ్ఞ. పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు విద్యార్థినిలందరికీ బాల్యవివాహా కారణాలు నష్టాలు బాల్య వివాహ నివారణ చర్యలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ చందు రాణి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యవివాహాల నుండి ఎలా రక్షణ పొందాలి మరియు ఫోక్సో చట్టం గురించి తెలియజేశారు. జిల్లా పిల్లల రక్షణ యూనిట్ ప్రొటెక్షన్ అధికారిని రాధా రాణి మాట్లాడుతూ టీనేజ్ పిల్లలు ఏ విధంగా ఆకర్షణలకు గురై తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని కావున విద్యార్థులు అందరూ జాగ్రత్త వహించి చక్కగా విద్యను ఆర్జించి ఉన్నత స్థానాలకు చేరాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థినిలు క్రమశిక్షణతో మెలిగి బాల్యవివాహాల సమాచారం 1098 నెంబర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా పోలీసులు శ్రీలక్ష్మి, మనోమిత్ర వైష్ణవి కళాశాల అధ్యాపకులు రాధాకృష్ణ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శరవణ కుమార్, ప్రదీప్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube