మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
NTODAY NEWS: గొల్లపల్లి మండల రిపోర్టర్ లక్ష్మణ్
అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలి: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే
మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో మరణించిన వారి ఓట్లను తొలగించాలని కోరారు. కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించామని తెలిపారు. వినతులను స్వీకరించినట్లు చెప్పారు. మరణించిన వారి ఓట్లు లేదా రెండు చోట్ల నమోదైన ఓట్ల సమాచారం అందితే తొలగిస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లు నాగరాజు, అయాస్, సమ్మయ్య, అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు వై. సునీల్ రావు, నాంపల్లి శ్రీనివాస్ (బీజేపీ), చల్లా హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్ (బీఆర్ఎస్), మడుపు మోహన్ (కాంగ్రెస్), పైడిపల్లి రాజు (సీపీఐ), మిల్కూరి వాసుదేవ రెడ్డి (సీపీఐఎం), తేజ దీప్ రెడ్డి (ఏఐఎఫ్ఎఫ్బీ) తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube