www.ntodaynews.com
కాన్సర్ హాస్పటల్ రోడ్ వేయించాలని ఇంచార్జ్ మంత్రిని కోరిన ఎమ్మెల్యే
తెలంగాణ
ఏలూరు నియోజకవర్గం లో కాన్సర్ హాస్పటల్ రోడ్ వేయించాలని ఇంచార్జ్ మంత్రి ని కోరిన ఎమ్మెల్యే బేడేటి రాధాకృష్ణయ్య
NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్.
22ఏ స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు.ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా 22ఏ స్థలాల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని ఆయన కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి మనోహర్,,, 30రోజుల్లోగా భూముల సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇందుకోసం డిసెంబర్ 16వ తేదీన ఒక ప్రత్యేక గ్రీవెన్స్ని సైతం నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో మరో జఠిలమైన సమస్యకు అతిత్వరలోనే పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే బడేటి చంటి చూపిన చొరవతో అధికార యంత్రాంగంలో కదలిక రావడంతో పాటూ అనేక మంది బాధితులు ఆ సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం పొందనున్నారు అని కార్యకర్తలు తెలియజేశారు. అలాగే వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా పెదపాడు వెళ్ళే రహదారి పూర్తిగా పాడైన నేపథ్యంలో ఏలూరు వైపునుండి తొలుత ఆ రహదారిని నిర్మించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి మనోహర్ స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు సమస్యలను సైతం ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు...
Follow us on
Website
Facebook
Instagram
YouTube