BREAKING
ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు..
www.ntodaynews.com

కాన్సర్ హాస్పటల్ రోడ్ వేయించాలని ఇంచార్జ్ మంత్రిని కోరిన ఎమ్మెల్యే

తెలంగాణ
26 Nov, 2025 - 06:28 AM
284 వీక్షణలు
ఏలూరు నియోజకవర్గం లో కాన్సర్ హాస్పటల్ రోడ్ వేయించాలని ఇంచార్జ్ మంత్రి ని కోరిన ఎమ్మెల్యే బేడేటి రాధాకృష్ణయ్య NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్. 22ఏ స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు.ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా 22ఏ స్థలాల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను మంత్రి మనోహర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని ఆయన కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి మనోహర్‌,,, 30రోజుల్లోగా భూముల సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇందుకోసం డిసెంబర్‌ 16వ తేదీన ఒక ప్రత్యేక గ్రీవెన్స్‌ని సైతం నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో మరో జఠిలమైన సమస్యకు అతిత్వరలోనే పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే బడేటి చంటి చూపిన చొరవతో అధికార యంత్రాంగంలో కదలిక రావడంతో పాటూ అనేక మంది బాధితులు ఆ సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం పొందనున్నారు అని కార్యకర్తలు తెలియజేశారు. అలాగే వంగాయగూడెం క్యాన్సర్‌ హాస్పిటల్‌ మీదుగా పెదపాడు వెళ్ళే రహదారి పూర్తిగా పాడైన నేపథ్యంలో ఏలూరు వైపునుండి తొలుత ఆ రహదారిని నిర్మించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి మనోహర్‌ స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు సమస్యలను సైతం ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు... Follow us on Website Facebook Instagram YouTube