BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం

తెలంగాణ
17 Jan, 2026 - 08:48 AM
204 వీక్షణలు

తొర్రూరు పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం

NTODAY NEWS: పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి రిపోర్టర్ వేణు తొర్రూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో తొర్రూరు మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొర్రూరు పట్టణ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో లోపాలు, తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మురుగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన పనులు, ప్రగతి వివరాలను తెలియజేయగా, పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా తొర్రూరు పట్టణ అభివృద్ధికి అవసరమైన చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని, రానున్న రోజుల్లో పట్టణంలో మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. #Palkurthi #Thorrur #MunicipalReview #UrbanDevelopment #PublicInfrastructure #DrinkingWater #Sanitation #ElectricitySupply #PublicService #GovernmentReview #TelanganaDevelopment Follow us on Website Facebook Instagram YouTube