www.ntodaynews.com
మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్
తెలంగాణ
మదనపల్లిలో మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్
గురుకులం చెస్ క్లబ్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు
మదనపల్లిలో నిర్వహించిన మొదటి మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్లో గురుకులం చెస్ క్లబ్కు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో బహుమతులు సాధించారు. ఈ విజయ ఫలితాలను గురుకులం చెస్ క్లబ్ గర్వంగా వెల్లడించింది.
విజేతల వివరాలు:
-అన్నమయ్య జిల్లా విభాగం – 2వ స్థానం
₹700 నగదు బహుమతి, మెమెంటో
ACM ఎం. సతీష్ – 9వ తరగతి, ZPHS గూడూరుపల్లి
-రేటింగ్ లేని కేటగిరీ – 9వ స్థానం
₹400 నగదు బహుమతి, మెమెంటో
విద్యార్థి – 10వ తరగతి, మున్సిపల్ హై స్కూల్, కొత్తిండ్లు (పుంగనూరు)
-అండర్–16 విభాగం – 3వ స్థానం
ట్రోఫీ
టి. గౌతమ్ – 8వ తరగతి, ZPHS గూడూరుపల్లి
-మహిళా అండర్–16 విభాగం – 8వ స్థానం
ట్రోఫీ
కె. సాయి నవ్యశ్రీ – 9వ తరగతి, ZPHS బాలికల పాఠశాల, పుంగనూరు
-మహిళా అండర్–13 విభాగం – 6వ స్థానం
జి. మోక్షిత – 6వ తరగతి, AP మోడల్ స్కూల్, ఆదివినాథునికుంట (పుంగనూరు)
-అండర్–9 విభాగం – 4వ స్థానం
ట్రోఫీ
ఎం. సౌర్య – 3వ తరగతి, శారద విద్యా నికేతన్, పుంగనూరు
-అండర్–9 విభాగం – 10వ స్థానం
పతకం
ఎల్. ప్రజ్వాన్ – 3వ తరగతి, నారాయణ పాఠశాల, పుంగనూరు
ఈ సందర్భంగా గురుకులం చెస్ క్లబ్ ప్రతినిధులు విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
చిన్న వయసులోనే చెస్లో ప్రతిభ చూపుతున్న ఈ విద్యార్థులు పుంగనూరు ప్రాంతానికి గర్వకారణం అని వారు పేర్కొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube