BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

నాగిరెడ్డిగూడెం గురుకులంలో నీటి సమస్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 06:18 AM
72 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో నెలకొన్న తీవ్రమైన నీటి సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం పాఠశాల ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించారు.

గత కొన్ని రోజులుగా పాఠశాలలో తాగునీరు, రోజువారీ అవసరాలకు సరిపడా నీటి సరఫరా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరత కారణంగా స్నానాలు చేయడం, మరుగుదొడ్లు వినియోగించడం కూడా కష్టంగా మారిందని విద్యార్థులు వాపోయారు.

నీటి సరఫరా నిలిచిపోవడంతో కిచెన్‌, హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని, దీంతో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతోనే నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు.

"విద్యార్థులకు న్యాయం చేయాలి... వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలి" అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.