నిఘా నీడలో గాలివీడు మండలం
నిఘా నీడలో గాలివీడు మండలం.. కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
నేరాల అదుపునకు సీసీ కెమెరాలు 'మూడో నేత్రం'లా నియంత్రణలో సాంకేతికతను జోడించి ప్రజలకు మరింత చేరువవడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. గాలివీడు పోలీసు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సిసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూము జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుదిల్లి ఐపిఎన్ గురువారం ఘనంగా ప్రారంభించారు.
మండల వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం మొత్తం 92 కెమెరాలను ఏర్పాటు చేయగా, అందులో 68 సోలార్ కెమెరాలు ఉండటం విశేషం ఎస్పీ గారు మాట్లాడుతూ, ఆధునిక కాలంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ వ్యవస్థ నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తుందని తెలిపారు
పనిచేస్తాయి: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్.
నిఘా నీడలో ప్రధాన ప్రాంతాలు:
మాలినీడు బస్ స్టాప్, రెడ్డివారిపల్లి క్లాష్ వెలిగల్లు డాష్ట్రం మరియు గేట్ సర్కీల్ వంటి 34 ప్రధాన ప్రాంతాలు ఇప్పుడు నిరంతర నిఘాలో ఉంటాయి.
ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో మండలంలోని వివిధ సంఘాలు, దాతల సహకారం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్సీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.