www.ntodaynews.com
నిరుపేద కుటుంబానికి అండగా గోలి పింగల్ రెడ్డి
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
నిరుపేద కుటుంబానికి అండగా గోలి పింగల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా ,బీబీనగర్ మండల కేంద్రంలోని ఇస్రాయిపల్లికుంట కు చెందిన పేరబోయిన బాలమ్మ ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించారు.బాలమ్మది నిరుపేద కుటుంబం కావడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి తన వంతు సహాయంగా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా ఆ నగదును కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరబోయిన బస్వరాజ్ యాదవ్ చేతుల మీదగా మృతురాలి కుటుంబ సభ్యులకు గురువారం రోజున అందజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లుట్ల సుధాకర్,హనుమాన్ యూత్ అధ్యక్షులు పేరబోయిన గణేష్, నెల్లుట్ల రాజు,నర్రోల బాలస్వామి,పేరబోయిన రాజు,నెల్లుట్ల లక్ష్మయ్య శ్రీశైలం,పేరబోయిన బాలకృష్ణ,ధర్మేష్, భాస్కర్,నెల్లుట్ల బస్వయ్య,అశోక్, మృతురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.