BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నిరుపేదల సొంతింటి కల నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బుగ్గారంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Mar, 2026 - 02:38 PM
53 వీక్షణలు

బుగ్గారం: నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం బుగ్గారం మండల కేంద్రంలో నక్క లక్ష్మి అనే లబ్ధిదారురాలికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ఘనంగా ప్రారంభించారు.

​పేదల పక్షపాతి మన ప్రభుత్వం:

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. లబ్ధిదారురాలు నక్క లక్ష్మికి ఇల్లు పూర్తి కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన అన్ని ఇందిరమ్మ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన, త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

​ప్రభుత్వ పథకాలు ప్రతి నిరుపేద గడపకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.