నిరుపయోగంగా మరుగుదొడ్లు... పట్టించుకోని దేవాదాయ శాఖ...
నిరుపయోగంగా మరుగుదొడ్లు... పట్టించుకోని దేవాదాయ శాఖ...
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమ్మవారి పాదాల చెంత నిర్మించిన మరుగుదొడ్లు చాలా కాలంగా నిరుపయోగంగా ఉండటంతో దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు,వృద్ధులు,చిన్నారులు మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని భక్తులు తెలిపారు.ఇప్పటికే నిర్మించిన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు తాగునీరు,పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి,నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు మరియు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.