BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

నంద్యాల జిల్లా లో పోలీసుల కీలక విజయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 02:00 AM
30 వీక్షణలు

నంద్యాల జిల్లా లో పోలీసుల కీలక విజయం 

జిల్లాలో పోలీసులు కీలక విజయం సాధించారు.అంతర్రాష్ట్ర స్థాయిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అరెస్ట్ చేసి,భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..!!


ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడిని నంద్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రత్యేక నిఘా,టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు 65 లక్షల రూపాయల విలువ చేసే 42 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..!!

చెయిన్‌లు,హారాలు,ఉంగరాలు,గాజులు వంటి ఆభరణాలు ఇందులో ఉన్నాయి.ఈ దొంగతనాలకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి,మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు..!!

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశామని,స్వాధీనం చేసుకున్న ఆభరణాలను కోర్టు ప్రక్రియ అనంతరం యజమానులకు అప్పగిస్తామని తెలిపారు..

మొత్తానికి,నంద్యాల జిల్లా పోలీసుల వేగవంతమైన చర్యలతో అంతర్రాష్ట్ర దొంగతనాల కేసులో కీలక మలుపు తిరిగింది.ఇలాంటి ఘటనలపై పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు..