BREAKING
మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
Date of Publish : 31 March 2026, 02:00 am
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాల జిల్లా లో పోలీసుల కీలక విజయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 02:00 AM
126 వీక్షణలు

నంద్యాల జిల్లా లో పోలీసుల కీలక విజయం 

జిల్లాలో పోలీసులు కీలక విజయం సాధించారు.అంతర్రాష్ట్ర స్థాయిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అరెస్ట్ చేసి,భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..!!


ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడిని నంద్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రత్యేక నిఘా,టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు 65 లక్షల రూపాయల విలువ చేసే 42 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..!!

చెయిన్‌లు,హారాలు,ఉంగరాలు,గాజులు వంటి ఆభరణాలు ఇందులో ఉన్నాయి.ఈ దొంగతనాలకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి,మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు..!!

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశామని,స్వాధీనం చేసుకున్న ఆభరణాలను కోర్టు ప్రక్రియ అనంతరం యజమానులకు అప్పగిస్తామని తెలిపారు..

మొత్తానికి,నంద్యాల జిల్లా పోలీసుల వేగవంతమైన చర్యలతో అంతర్రాష్ట్ర దొంగతనాల కేసులో కీలక మలుపు తిరిగింది.ఇలాంటి ఘటనలపై పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు..