BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

నంద్యాల జిల్లా లో పోలీసుల కీలక విజయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 02:00 AM
50 వీక్షణలు

నంద్యాల జిల్లా లో పోలీసుల కీలక విజయం 

జిల్లాలో పోలీసులు కీలక విజయం సాధించారు.అంతర్రాష్ట్ర స్థాయిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అరెస్ట్ చేసి,భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..!!


ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడిని నంద్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రత్యేక నిఘా,టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు 65 లక్షల రూపాయల విలువ చేసే 42 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..!!

చెయిన్‌లు,హారాలు,ఉంగరాలు,గాజులు వంటి ఆభరణాలు ఇందులో ఉన్నాయి.ఈ దొంగతనాలకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి,మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు..!!

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశామని,స్వాధీనం చేసుకున్న ఆభరణాలను కోర్టు ప్రక్రియ అనంతరం యజమానులకు అప్పగిస్తామని తెలిపారు..

మొత్తానికి,నంద్యాల జిల్లా పోలీసుల వేగవంతమైన చర్యలతో అంతర్రాష్ట్ర దొంగతనాల కేసులో కీలక మలుపు తిరిగింది.ఇలాంటి ఘటనలపై పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు..