BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం
www.ntodaynews.com

నూజివీడు ఎక్సైజ్ పరిధిలో మార్పు కార్యక్రమం విజయవంతం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 07:27 PM
40 వీక్షణలు

30 మందికి పునరావాసం – స్వయం ఉపాధి వైపు మలుపు

నూజివీడు, ఏప్రిల్ 2: నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన “మార్పు కార్యక్రమం” ఫలితంగా గతంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడిన 30 మందికి పునరావాసం కల్పించి, ఉపాధి అవకాశాలు అందజేశారు. దీంతో వారు అక్రమ కార్యకలాపాలకు దూరంగా వెళ్లి, క్రమబద్ధమైన జీవన విధానంలోకి అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. విన్నుత్న పాల్గొని లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. వారి జీవన విధానం, ఉపాధి పురోగతిని సమీక్షించి, ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గతంలో సారా అమ్మకం వంటి అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారు ప్రస్తుతం స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ మార్పుతో వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం కూడా పొందుతున్నారని పేర్కొన్నారు.

సబ్ కలెక్టర్ బి. విన్నుత్న మాట్లాడుతూ, “మార్పు కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తున్నాయి. లబ్ధిదారుల విజయాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిత, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.