BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 08:38 PM
147 వీక్షణలు

నూజివీడు జనసేన రాజకీయాల్లో మరోసారి బర్మా ఫణి బాబు పేరు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ కష్టకాలంలోనూ కేడర్‌తో పాటు నిలబడి పనిచేసిన ఫణి బాబుకు మళ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలపై జోరుగా చర్చ సాగుతోంది.

కూటమి ప్రభుత్వంలో మంత్రి కొలుసు పార్థసారధితో సమన్వయం కొనసాగిస్తూ, నూజివీడు నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవులు వంటి కీలక అవకాశాలను దక్కించడంలో బర్మా ఫణి బాబు కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో స్థానికంగా ఆయన ప్రభావం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు, కొంతమంది స్థానిక నాయకులు వ్యతిరేక ప్రచారం, సోషల్ మీడియా పోస్టులతో ఫణి బాబును టార్గెట్ చేస్తున్నప్పటికీ, అవి పార్టీ అధిష్టానం వద్ద పెద్దగా ప్రభావం చూపలేదని సమాచారం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకుడిగా ఆయనపై జనసేన పెద్దలు ఇప్పటికీ విశ్వాసం ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కేడర్‌లో కూడా “మళ్లీ ఫణి బాబుకే బాధ్యతలు” అన్న చర్చ ఊపందుకోవడంతో, నూజివీడు జనసేనలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.