నూజివీడు: నవోదయం–2.0 కార్యక్రమం క్రింద నూతన చర్యలు
నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ నాగ ప్రభు కుమార్, మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు, నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు తీసుకోబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ముగ్గురు నేరస్తులు నూజివీడు తహసిల్దార్ వద్ద హాజరై బైండ్ ఓవర్ చేయబడినట్లు అధికారులు తెలిపారు.
బైండ్ ఓవర్ వివరాలు:
మిద్దె నరేంద్ర బాబు – తూర్పు దిగవల్లి గ్రామం, నూజివీడు మండలం
మూడు కృష్ణ – ఒగిరాలతండ గ్రామం, నూజివీడు మండలం
పెనుమెల కోటేశ్వర రావు – దేవరగుంట గ్రామం, నూజివీడు మండలం
హెచ్చరిక: ఈ బైండ్ ఓవర్ ఒక సంవత్సరం కాల పరిమితి కలిగి ఉంటుందని, ఈ కాలంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే రూ.1,00,000/- జరిమానా విధించబడుతుందని, అలాగే ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని అధికారులు హెచ్చరించారు.
నాటు సారా పై చర్యలు: నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారు, నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సప్లై చేసే వ్యాపారులు, మరియు నాటు సారా తయారీకి బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానులపై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ మస్తానయ్య కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.