నరసింహారావుపాలెంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు గార్లపాటి మారేష్, తల్లాడ శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమవుతారని తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కటారి శ్రీమోను, కంచిపోగు రాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.