www.ntodaynews.com
వివాహం ఆలస్యమవుతోందని యువతి ఆత్మహత్య
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
నస్పూర్: వివాహం ఆలస్యమవుతోందని యువతి ఆత్మహత్య
నస్పూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన కార్య రజిత (19) వివాహం ఆలస్యం అవుతుందనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. రజిత అదే కాలనీకి చెందిన ఉప్పు మహేష్ను గత కొంతకాలంగా ప్రేమిస్తుండగా, ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, మహేష్ తాను ఇంటి నిర్మాణం చేపడుతున్నందున పెళ్లిని కొద్దిరోజులు వాయిదా వేయాలని కోరడంతో, ఆ నిర్ణయం తట్టుకోలేక రజిత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు