BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు

తెలంగాణ
07 Nov, 2025 - 07:58 AM
223 వీక్షణలు
ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు NTODAY NEWS: చిట్యాల విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నేరడ ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 27 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంచే ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠ్యాంశాలు సాఫీగా సాగిపోయావని మరొక ఉపాధ్యాయుడు పదోన్నతి పై బదిలీ కావడంతో ఒకే ఉపాధ్యాయుడు వీరికి బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం లో ఇబ్బందికరంగా మారిందని, విద్యార్థులకు సమయానుగుణం గా పాఠ్యాంశాలు అయిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అంతేకాకుండా ఒకే ఉపాధ్యాయుడు ఉండడం చేత అన్ని తరగతుల విద్యార్థులను ఒకే తరగతిలో కూర్చోబెట్టి బోధించడంతో విద్యార్థులు ఎంతో అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలకు కావలసిన టీచర్లను నియమించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. Follow us on Website Facebook Instagram YouTube