BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అలంకరణ చేపల పెంపకంతో మహిళలకు ఆర్థిక సాధికారత

తెలంగాణ
06 Feb, 2026 - 08:26 AM
311 వీక్షణలు
అలంకరణ చేపల పెంపకంతో మహిళలకు ఆర్థిక సాధికారత కాకినాడలో కరీంనగర్ మహిళలకు ప్రత్యేక శిక్షణ పూర్తి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  మహిళలు సంప్రదాయ ఉపాధి మార్గాలకే పరిమితం కాకుండా, వినూత్న రంగాలను ఎంచుకున్నప్పుడు మాత్రమే ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోగలరని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలోని ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు శుక్రవారం కలెక్టర్‌ను ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా శిక్షణలో భాగంగా తాము స్వయంగా తయారు చేసిన అక్వేరియంను కలెక్టర్‌కు అందజేశారు. శిక్షణలో ముఖ్య అంశాలు జిల్లాకు చెందిన 19 మంది మహిళలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా:- అలంకరణ చేపల రకాలు, వాటి సంతానోత్పత్తి విధానాలు చేపల పెంపకానికి అనువైన నీటి యాజమాన్యం, వాతావరణ పరిస్థితులు చేపల ఆహారం తయారీ, ప్యాకింగ్ విధానాలు అక్వేరియం తయారీ, అలంకరణ పద్ధతులు తక్కువ పోటీ.. మెరుగైన ఆదాయం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు పరిమిత రంగాలకే ఉపాధిగా మొగ్గుచూపడం వల్ల పోటీ పెరుగుతోందని, అలంకరణ చేపల పెంపకానికి మాత్రం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ రంగంలో శిక్షణ పొందడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావచ్చని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విభిన్న రంగాల్లో మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ భారతి, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, ఎఫ్‌డీఓ మంజుల మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. #WomenEmpowerment #OrnamentalFishFarming #SelfEmployment #SkillDevelopment #FisheriesTraining #EconomicEmpowerment #Karimnagar #Kakinada #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube