www.ntodaynews.com
పాలిమర్ నోట్లకు కేంద్రం ఆమోదం
జాతీయం
రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది.
కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు, నకిలీ నోట్ల తయారీని అరికట్టేందుకు ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి.
భారతదేశంలో తొలుత రూ.10, రూ.20 నోట్లను పాలిమర్ రూపంలో ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.