BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

పదో తరగతి టాపర్లకు రఘునాథ్ వెరబెల్లి అభినందనలు, బహుమతుల ప్రదానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 Apr, 2026 - 12:05 PM
49 వీక్షణలు

పదో తరగతి టాపర్లకు రఘునాథ్ వెరబెల్లి అభినందనలు, బహుమతుల ప్రదానం

మంచిర్యాల గర్మిళ్ళ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఘనంగా అభినందించి, వారికి నగదు బహుమతులు మరియు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల టాపర్‌గా నిలిచిన ఫాతిమాకు రూ. 10,000 నగదు బహుమతిని అందజేయగా, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచిన పూజిత, వైష్ణవిలకు సైకిళ్లను బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాణించడం అభినందనీయమని, ఈ విజయం ఉపాధ్యాయుల కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచిస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది